News July 3, 2024
సభను కాదు, మర్యాదను విడిచి వెళ్లారు: ధన్ఖడ్
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి అడ్డుతగిలి, సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సభలో వారు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. విపక్ష నేతలు సభను కాదు. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు.. జీవితానికి మార్గనిర్దేశం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 21, 2024
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల
AP: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.
News September 21, 2024
BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వజం
గురుగ్రామ్లో రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ కారు వ్యక్తి మృతికి కారణమవ్వడంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘటనలో బైకర్ మృతికి కారణమైన కారు డ్రైవర్కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అతని కారుపై BJP స్టిక్కర్ ఉండడమే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టికర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిపడింది.
News September 21, 2024
సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కీలక ఆదేశాలు
AP: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22తో బదిలీల ప్రక్రియ గడువు ముగియనుంది. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సర్కార్ చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఉద్యోగులను వారి స్థానాల నుంచి రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను GOVT ఆదేశించింది.