News March 19, 2024

123 అడుగుల దోశ వేసి రికార్డు సృష్టించారు

image

బెంగళూరులోని కొందరు చెఫ్‌లు వినూత్నంగా ఆలోచించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఏకంగా 123 అడుగుల పొడవైన దోశను తయారు చేశారు. మొత్తం 75 మంది చెఫ్‌లు కలిసి ఈ భారీ దోశను వేశారు. దాదాపు 110 విఫల ప్రయత్నాల తర్వాత ఈ రికార్డు నమోదైంది. అంతకుముందు, గిన్నిస్ రికార్డ్స్‌లో 16.68 మీటర్లు (54 అడుగుల 8.69 అంగుళాలు) దోశ ఉండేది.

Similar News

News December 26, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.

News December 26, 2025

భారత్ ఘన విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

News December 26, 2025

VHT: మరో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ?

image

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ అదరగొడుతున్నా విషయం తెలిసిందే. ఆడిన 2 మ్యాచుల్లో 133, 77 రన్స్ చేశారు. నేషనల్ టీమ్‌లోని ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్‌లో ఏడాదికి కనీసం 2మ్యాచులు ఆడాలని BCCI రూల్ పెట్టింది. అందుకే రోహిత్, కోహ్లీ చెరో రెండు మ్యాచులు ఆడేశారు. కానీ కోహ్లీ మరో మ్యాచ్ కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విరాట్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.