News April 4, 2025

చరిత్ర సృష్టించాడు!

image

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లతో సత్తా చాటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఫైఫర్ తీసిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. 4 ఓవర్లలో 36 పరుగులకు పూరన్, పంత్, మార్క్‌రమ్, మిల్లర్, ఆకాశ్ దీప్ వికెట్లను తీశారు. ఆయన టీ20 కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.

Similar News

News April 12, 2025

మూడు రెట్లు పెరగనున్న ‘ఆటో’ ఎగుమతులు: నీతి ఆయోగ్

image

ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విలువ 2030 నాటికి ₹12 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీపై ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతులు ₹1.72L Cr నుంచి 3రెట్లు పెరిగి రూ.5.16L Crకు చేరుతాయని పేర్కొంది. ఆటోమోటివ్ సెక్టార్‌లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదించింది. వాహన ఉత్పత్తుల్లో చైనా, US, జపాన్ తర్వాత IND 4వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

News April 12, 2025

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 15-22 మధ్య ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13-22 మధ్య అప్లై చేసుకోవాలి.

News April 12, 2025

4 రోజుల్లో రూ.5,940 పెరిగిన బంగారం ధర

image

గోల్డ్ రేట్స్ వరుసగా నాలుగోరోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.95,670కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 పెరిగి రూ.87,700గా నమోదైంది. దీంతో 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం రేట్ రూ.5,940 పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2000 పెరిగి రూ.1,10,000కు చేరింది.

error: Content is protected !!