News October 22, 2024
ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

గుజరాత్లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.
Similar News
News January 8, 2026
దేవుడి విగ్రహాలు, చిత్రపటాలను ఏ రోజు శుభ్రం చేయాలి?

ఇంట్లో దేవుడి చిత్రపటాలు, విగ్రహాలను శుభ్రం చేయడానికి గురువారం శుభప్రదమైన రోజని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం, మంగళవారాల్లో వాటిని కదపకూడదని హెచ్చరిస్తున్నారు. ‘ప్రతి వారం వీలుపడకపోతే అమావాస్య రోజున శుభ్రం చేయాలి. అమావాస్య శుక్రవారం వస్తే గురువారమే శుద్ధి చేసుకోవాలి’ అని చెబుతున్నారు. దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు పొందాలంటే ఇంట్లో ఏయే విగ్రహాలు ఉండాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 8, 2026
ఫేస్వాష్ ఎందుకు వాడాలంటే?

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఫేస్వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. కానీ సబ్బులో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్వాష్లు చర్మాన్ని మృదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.
News January 8, 2026
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

TG: హైదరాబాద్ శివారు మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థిని నక్షత్ర గాయపడ్డారు. మృతులను సూర్యతేజ(20), సుమిత్(20), శ్రీనిఖిల్(20), రోహిత్(18)గా గుర్తించారు. వీరంతా ICFA ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్లు తెలుస్తోంది. కారులో మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.


