News October 22, 2024

ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

image

గుజరాత్‌లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్‌లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.

Similar News

News October 22, 2024

2 రోజుల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి నాదెండ్ల

image

AP: ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. మొదటి రకం వడ్లను మద్దతు ధర రూ.2,350తో కొంటామన్నారు. రైతులు వారికి నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గోనెసంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

News October 22, 2024

మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు?

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్ష మ‌హావికాస్ అఘాడీ కూట‌మి పార్టీలు సీట్ల స‌ర్దుబాటులో ఏకాభిప్రాయానికి వ‌చ్చినట్టు తెలుస్తోంది. ప్ర‌తిపాదిత ఒప్పందం మేర‌కు 288 స్థానాల్లో కాంగ్రెస్ 105-110 స్థానాల్లో, శివ‌సేన UBT 90-95 స్థానాల్లో, NCP SP 75-80 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింప‌నున్నాయి. కాంగ్రెస్-ఉద్ధవ్ మధ్య లుకలుకలు నడుస్తున్నాయన్న వార్తల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గమనార్హం.

News October 22, 2024

కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలి: ఉద్యోగుల జేఏసీ

image

TG: కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28న సీఎం, సీఎస్‌కు, నవంబర్ 2న కలెక్టర్లు, 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు కార్యాచరణ లేఖలు ఇవ్వనుంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, JAN 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు నిర్వహించనుంది.