News October 22, 2024
ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

గుజరాత్లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.
Similar News
News November 28, 2025
శ్రీరాంపూర్: స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చ

శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
News November 28, 2025
2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.


