News June 3, 2024
రోహిత్తో అతడే ఓపెనింగ్ చేయాలి: గవాస్కర్

టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఫామ్లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడారన్నారు. ఉత్తమ ప్లేయర్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారని తెలిపారు. కాగా బంగ్లాతో వార్మప్ మ్యాచులో రోహిత్తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు.
Similar News
News December 18, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* టమాటాలు బాగా మగ్గినపుడు కాగితం సంచిలో ఉంచి యాపిల్ను పెడితే మరో 2రోజులు తాజాగా ఉంటాయి.
* మీల్ మేకర్ అల్యూమినియం పాత్రల్లో ఉడికిస్తే గిన్నె నల్లగా మారిపోతుంది.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలనుకొన్నప్పుడు శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి.
* అరటికాయలు కోసిన తరువాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్ళలో 4చుక్కల వెనిగర్ కలపాలి.
News December 18, 2025
క్లౌడ్, ఆన్లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: CBN

AP: భూ రికార్డుల ఆర్కైవ్స్నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని CM CBN అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.


