News June 3, 2024
రోహిత్తో అతడే ఓపెనింగ్ చేయాలి: గవాస్కర్

టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఫామ్లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడారన్నారు. ఉత్తమ ప్లేయర్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారని తెలిపారు. కాగా బంగ్లాతో వార్మప్ మ్యాచులో రోహిత్తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు.
Similar News
News December 11, 2025
నేడు ఆ స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లకు గానూ నిన్న కూడా ఈ పాఠశాలలకు హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13, 14.. 16, 17 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆయా బడుల్లో అదనపు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.
News December 11, 2025
భవానీ దీక్షల విరమణ.. భారీ ఏర్పాట్లు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ మండల దీక్ష విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి AP, TGతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి 7L మంది భవానీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ కోసం 9KM మార్గాన్ని సిద్ధం చేశారు. దర్శనం కోసం 13 కౌంటర్లు, 3 హోమగుండాలు, నిత్యాన్నదానం, రైల్వే, బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.
News December 11, 2025
రుణ విముక్తి కోసం రేపు ఇలా చేయండి: పండితులు

రుణబాధలు తొలగిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనకధారా స్తోత్రం చదివి, పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆర్థిక బాధలు పోతాయంటున్నారు. ‘మహిళలు స్నానం చేసే, ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేయాలి. ఫలితంగా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణ విముక్తి కూడా కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందాలంటే పూజా మందిరంలో కూర్మం(తాబేలు) ఉంచండి’ అని సూచిస్తున్నారు.


