News December 17, 2024
కోడిపిల్లను అమాంతం మింగేశాడు.. ఆ తర్వాత..

ఛత్తీస్గఢ్కు చెందిన ఆనంద్ యాదవ్కు పిల్లల్లేరు. పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తంత్రకుడిని సంప్రదించాడు. అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మరణించాడు. పోస్టుమార్టమ్లో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు. ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


