News December 17, 2024
కోడిపిల్లను అమాంతం మింగేశాడు.. ఆ తర్వాత..

ఛత్తీస్గఢ్కు చెందిన ఆనంద్ యాదవ్కు పిల్లల్లేరు. పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తంత్రకుడిని సంప్రదించాడు. అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మరణించాడు. పోస్టుమార్టమ్లో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు. ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Similar News
News October 15, 2025
రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

TG: CM రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు మ.3 గం.కు సమావేశం కానుంది. ప్రధానంగా BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్ట్, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు చర్చకు రానున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
News October 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 36

1. దశరథుడి తల్లి పేరేంటి?
2. పాండవులు అజ్ఞాతవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు ధనస్సు పేరేంటి?
4. తెలంగాణలోని ‘భద్రాచలం’ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. శుక అంటే ఏ పక్షి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 15, 2025
L.C.A-625 మిరప రకం ప్రత్యేకలు ఇవే

ఎండు మిరప కింద సాగుకు ఈ రకం అనువైనది. ఈ రకం మొక్కలు ఎత్తైన కొమ్మలతో బలంగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి కాయలు ఎక్కువగా కాస్తాయి. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవు (8-10 సెం.మీ.) ఉండి.. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటుతో పాటు ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉంటాయి. తాలు కాయలు చాలా తక్కువగా ఉంటాయి. కాయకుళ్లు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.