News March 13, 2025
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.
Similar News
News March 13, 2025
KKR కెప్టెన్గా రహానే.. కారణం ఇదే

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.
News March 13, 2025
నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.