News November 30, 2024

జడ్జికే లంచం ఇవ్వబోయాడు.. అరెస్టయ్యాడు!

image

గుజరాత్‌లో ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చేందుకు యత్నించాడో వ్యక్తి. పంచమహల్ జిల్లా కోర్టులోకి ప్రవేశించిన బాపూ సోలంకీ అనే వ్యక్తి సరాసరి న్యాయమూర్తి ముందు ఓ సీల్డ్ కవర్ పెట్టాడు. కోర్టు సిబ్బంది దాన్ని ఓపెన్ చేయగా రూ.35వేలు కనిపించాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరో ఇవ్వమన్నారని సమాధానమిచ్చాడు. జడ్జి ఆదేశాల మేరకు ACB అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు.

Similar News

News April 1, 2026

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

image

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.

News April 1, 2026

రేషన్ కార్డులు ఉన్నవారికి భారీ శుభవార్త

image

దేశవ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు.

News April 1, 2026

కస్టమర్లకు ఈరోజు బ్యాంక్ సేవలు దూరం

image

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగనుండగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లుండి మళ్లీ సెలవు ఉంటుంది.