News August 11, 2024

HEADLINES

image

* వయనాడ్‌ను సందర్శించిన మోదీ.. బాధితులకు పరామర్శ
* తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు
* వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారు: YS జగన్
* కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని TG క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
* కుక్కల దాడులు పెరుగుతున్నా పట్టించుకోరా?: హరీశ్ రావు
* కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. జాగ్రత్త: WHO
* వినేశ్ కేసుపై తీర్పు రేపటికి వాయిదా

Similar News

News March 15, 2026

100 కుక్కలకు విషం పెట్టి చంపేశారు

image

TG: మంచిర్యాల జిల్లాలో 100 వీధికుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7-8 తేదీల్లో జన్నారం మం. కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుక్కలను చంపేందుకు ఇద్దరిని నియమించుకున్నారు. వారు కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్లు ఎక్కించారు. అవి చనిపోయాక కళేబరాలను ఓ నది ఒడ్డున పూడ్చి పెట్టారు. జంతు సంక్షేమ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు సర్పంచ్, PSపై కేసు నమోదు చేశారు.

News March 15, 2026

దుబాయ్‌లోనే ఉంటాం: విదేశీయులు

image

యుద్ధంలో దుబాయ్ నష్టపోతున్నా అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆ దేశంపై నమ్మకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దుబాయ్‌పై 300 మిస్సైళ్లు, 1,567 డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 90% ఆయుధాలను UAE అడ్డుకుంది. అయితే వాటి శిథిలాలు జనావాసాలు, వ్యాపార భవంతులపై పడ్డాయి. దుబాయ్ పాలకులపై నమ్మకం ఉందని, వారు తమను రక్షిస్తున్నారని ఇతర దేశస్థులు చెప్పారు. దుబాయ్ చాలా సురక్షితమైన నగరమని, వదిలే ఉద్దేశం లేదని తెలిపారు.

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.