News December 11, 2024

మోహన్ ‌బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

image

TG: మంచు మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనను విచారణకు పిలుస్తూ రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్‌ను విచారిస్తున్నారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 22, 2025

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కల ‘ధర’హాసం..!

image

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతవారం కిలో రూ.250 ధర ఉండగా శనివారం 300కి చేరిందని స్థానికులు తెలిపారు. అతి చల్లని ప్రదేశాలు ఉన్న చింతపల్లి, పాడేరు, ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో కొండలపై గిరిజనులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో పంటకు తీవ్రంగా నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి లేక రేటు పెరిగిపోతుందన్నారు.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.

News November 22, 2025

క్షమాపణలు చెప్పిన అల్‌-ఫలాహ్‌ వర్సిటీ

image

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్‌-ఫలాహ్‌ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్‌సైట్‌లో ఉన్న పాత అక్రిడిటేషన్‌ వివరాలపై NAAC షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్‌సైట్ డిజైన్‌ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్‌లను తమ సైట్‌లో కొనసాగిస్తూ వచ్చింది.