News July 10, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 23కు వాయిదా

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. ట్యాపింగ్ ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బాధితుల్లో ఓ జడ్జి, ఆయన భార్య కూడా ఉన్నారన్నదానిపై స్పందించిన కోర్టు.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు బహిర్గతం చేయొద్దని మీడియాను ఆదేశించింది.

Similar News

News October 18, 2025

‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

image

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

News October 18, 2025

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

image

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <>గెజిట్<<>> జారీచేసింది. 2019లో BPS ద్వారా 2018 ఆగస్టు వరకు ఉన్న నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేశారు. అయితే తాజాగా 59,041 అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీటి క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్‌ను 2025 ఆగస్టు 31గా సవరించారు. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

News October 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

image

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>