News September 23, 2024
ఫిరాయింపుల పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ

TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలను అనుభవిస్తున్నారని, ఇలా చేయడం రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పాల్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాగా ఈ విషయంలో ఈరోజు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
Similar News
News January 24, 2026
శబరిమలలో మూవీ షూటింగ్? విచారణకు ఆదేశం!

అయ్యప్ప సన్నిధానంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మలయాళ డైరెక్టర్ అనురాజ్ మనోహర్ నిషేధిత ప్రాంతంలో వీడియోగ్రఫీ చేశారన్న ఫిర్యాదుపై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. షూటింగ్కు అనుమతి అడిగినా బోర్డు నిరాకరించిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాము పంబలో మాత్రమే వీడియో తీశామని మనోహర్ తెలిపారు.
News January 24, 2026
బాలికలను ఎగరనిద్దాం..

అమ్మాయిలు ప్రస్తుతం యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించే కాకుండా బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం.
News January 24, 2026
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: CBN

AP: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని CM చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.


