News April 3, 2024
పెన్షన్ల పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

AP: పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ.. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారని.. తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ వాదించారు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


