News October 21, 2024
నేడు సుప్రీంలో గ్రూప్-1పై విచారణ

TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 31, 2025
నెట్వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.
News October 31, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 31, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ఫైర్

ఇస్తాంబుల్లో ఐదు రోజులుగా పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించింది. దోహాలో OCT 18-19 మధ్య జరిగిన సీజ్ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ‘పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం ఆధారంగా పాక్తో ఎప్పుడూ తాము సత్సంబంధాలే కోరుకుంటాం’ అని అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.


