News July 8, 2024
కవిత పిటిషన్పై విచారణ వాయిదా

BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.
Similar News
News December 28, 2025
స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్గా, ఓవరాల్గా నాలుగో బ్యాటర్గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.
News December 28, 2025
శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.
News December 28, 2025
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా సురేశ్ బాబు

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో <<18695841>>ఫిల్మ్ ఛాంబర్ <<>>ప్రెసిడెంట్గా డి.సురేశ్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా దామోదరప్రసాద్ను ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది కార్యవర్గంలో 31 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు, 17 మంది మన ప్యానెల్ మెంబర్స్ విజయం సాధించారు. 2027 వరకు సురేశ్ బాబు ప్రెసిడెంట్గా ఉండనున్నారు.


