News June 24, 2024
కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ వాయిదా

లిక్కర్ కేసులో CM కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. ED వేసిన స్టే పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తుది ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సూచించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ED హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆ బెయిల్పై తాత్కాలిక స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ SCకి వెళ్లారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


