News May 23, 2024
రీపోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

AP: సత్తెనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్లు, చంద్రగిరిలోని 4 కేంద్రాల్లో TDP నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈవోతోపాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.
Similar News
News November 16, 2025
IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్ , లివింగ్స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
News November 16, 2025
APPY NOW: జమ్మూ సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో 5 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికే ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్సైట్: https://cujammu.ac.in/
News November 16, 2025
మరోసారి బిహార్ CMగా నితీశ్!

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి బిహార్ CMగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. PM మోదీ షెడ్యూల్ బట్టి తుది తేదీ నిర్ణయించనున్నారు. 89 సీట్లు గెలిచిన బీజేపీకి 15/16, 85 స్థానాల్లో విజయం సాధించిన JDUకు 14, లోక్ జన్శక్తి పార్టీకి 3 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు CMగా ప్రమాణం చేశారు. 20 ఏళ్లు పదవిలో ఉన్నారు.


