News April 6, 2024
నేడు సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతేడాది మార్చిలో అరెస్ట్ అయిన సిసోడియా పలుమార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని ట్రయల్ కోర్టు, మరోసారి ఢిల్లీ హైకోర్టు, ఓసారి సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను కొట్టేశాయి.
Similar News
News December 7, 2025
వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.
News December 7, 2025
మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.
News December 7, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<


