News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
Similar News
News October 17, 2025
అన్నింటా రాణిస్తున్న అతివలు

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.
News October 17, 2025
23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
News October 17, 2025
తడిలో చేతిపై ముడతలు.. ఇందుకేనట!

నీటిలో కొద్దిసేపు ఉండగానే చేతులు, పాదాలపై ముడతలు ఏర్పడటం చూస్తుంటాం. ఈ ప్రక్రియను ఓస్మోటిక్ వ్యాప్తి అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిలో ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు. ‘శరీరంలోని అటానమిక్ నెర్వస్ సిస్టమ్ రక్త నాళాలను సంకోచింపజేయడం ద్వారా ముడతలు ఏర్పరుస్తుంది. ఆదిమానవులు తడి వాతావరణంలో ఆహారం సేకరించేందుకు ఇవి ఉపయోగపడేవి’ అని అభిప్రాయపడ్డారు.