News July 26, 2024
YS జగన్ పిటిషన్పై విచారణ వాయిదా

AP: అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని YS జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ విచారణార్హతపై ప్రభుత్వం తరఫున AG అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని, అప్పటివరకు వాయిదా వేయాలని AG కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News February 1, 2026
TTD EO సింఘాల్ బదిలీ..రవిచంద్రకు బాధ్యతలు

AP: TTD EO అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో CM ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని, చర్యలు చేపట్టాలని CBI SIT నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. తక్షణమే అదనపు EO వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని, జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్ను ఆదేశించింది.
News February 1, 2026
పన్నుల వాటా: APకి ₹64362 కోట్లు, TGకి ₹33180 కోట్లు

FY26-27కి యూనియన్ ట్యాక్స్లు, డ్యూటీ నికర ఆదాయాల నుంచి రాష్ట్రాల వారీగా పంపిణీ అయ్యే నిధులను కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఏపీకి ₹64362 CR, ₹33180 CR అందనున్నాయి. గతేడాదిలో APకి ₹56373 CR, TGకి ₹29280 CR రివైజ్డ్ కేటాయింపుల్లో చూపింది. కాగా యూపీకి ₹268910 CR బిహార్కు ₹151831 CR, మధ్యప్రదేశ్కు ₹112133CR మహారాష్ట్ర కు ₹98306CR రాజస్థాన్కు ₹90445CR కేటాయించింది.
News February 1, 2026
రక్షణ రంగానికి కేటాయింపులు పెంపు

2026 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.1.04 లక్షల కోట్లు అధికం. ఆయుధాల ఆధునికీకరణకు రూ.2.19 లక్షల కోట్లు(21.84% పెంపు), రోజువారీ నిర్వహణకు 17.24% అదనపు నిధులు ఇచ్చారు. పెన్షన్ల కోసం రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించారు. GDPలో రక్షణ వ్యయం 8% నుంచి 11% పెరిగింది. సరిహద్దు సవాళ్ల నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ భారీ కేటాయింపులు జరిగాయి.


