News May 18, 2024

కెరీర్‌లో రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యింది: కోహ్లీ

image

జట్టును గెలిపించడానికే తాను ఫీల్డ్‌లో కృషి చేస్తానని, దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని కోహ్లీ స్పష్టం చేశారు. ఆటపై తన ప్రేమ, ఆకలి ఎప్పటికీ తగ్గబోదన్నారు. వచ్చే T20WCకు ఇదే తన ప్రేరణ అని చెప్పారు. జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌లో ఒకే ఏడాది(2016) రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యిందని పేర్కొన్నారు. T20WC సెమీ ఫైనల్‌లో ఓడటం, ఐపీఎల్ ఫైనల్‌లో పరాజయం బాధించిందని తెలిపారు.

Similar News

News January 4, 2026

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)నవీ ముంబైలో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 6) ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజినీర్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. ప్రాజెక్టు ఇంజినీర్లకు 32 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు). ట్రైనీ Engg.కు JAN 16న, ప్రాజెక్ట్ Engg.కు JAN 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: bel-india.in

News January 4, 2026

5 రోజులే పని చేస్తాం: బ్యాంక్ ఉద్యోగులు

image

బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని ఆల్‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ‘ప్రపంచమంతా వారానికి 4 రోజుల పని విధానం వైపు అడుగులేస్తుంటే బ్యాంకు ఎంప్లాయిస్ 24×7 పనిచేస్తున్నారు. 5 రోజుల పని విధానానికి ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఒప్పుకుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించాలి’ అని పేర్కొంది. కాగా Xలో 5DayBankingNow హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది.

News January 4, 2026

సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల మోత!

image

సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు ₹2,700 నుంచి ₹4,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైన్ రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్యాసింజర్స్ ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ వారు సీటును బట్టి ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.