News March 29, 2025
రేపు 126 మండలాల్లో వడగాలులు

AP: సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. రేపు 126, ఎల్లుండి 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. అల్లూరి జిల్లా చింతూరులో అత్యధికంగా రేపు 43.7, ఎల్లుండి 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఎండలు రికార్డవుతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం <
Similar News
News April 1, 2025
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక ఇన్స్టంట్ బీర్ కేఫ్లు?

TG: రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం. సిటీల్లో ప్రతి 3 కి.మీ ఒకటి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది.
News April 1, 2025
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు 41 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,762కు చేరింది. హైదరాబాద్లో 1,985గా ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగానే రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
News April 1, 2025
తప్పంతా బ్యాటర్లదే: రహానే

IPL-2025: MIతో నిన్న జరిగిన మ్యాచ్లో ఓటమిపై KKR కెప్టెన్ రహానే స్పందించారు. మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యమే కారణమన్నారు. బౌన్స్తో కూడిన మంచి బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ భాగస్వామ్యాలు నమోదు కాలేదని చెప్పారు. 180-190 వరకు స్కోర్ చేస్తామని భావించినా పవర్ ప్లేలోనే 4వికెట్లు కోల్పోవడంతో సాధ్యపడలేదన్నారు. బౌలర్లు పోరాడినా స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఫలితం దక్కలేదని తెలిపారు.