News March 20, 2025

రేపు 49 మండలాల్లో వడగాలులు

image

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం-12, విజయనగరం-16, మన్యం-13, అల్లూరి-1, కాకినాడ-2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

Similar News

News October 30, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు.. సుడిదోమ నివారణ ఎలా?

image

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేస్తున్నప్పుడు సుడిదోమ ఉద్ధృతి పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వరి పొలంలో కాలిబాటలను తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

News October 30, 2025

81 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 81 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 10 లోపు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. పోస్టును బట్టి PhD, మాస్టర్ డిగ్రీ, NET, CSIR, BE, బీటెక్, ME, ఎంటెక్, MS, MBBS, డిగ్రీ, ఇంటర్ , టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cuk.ac.in/

News October 30, 2025

అపమృత్యు భయం పోవడానికి ఏ అభిషేకం..?

image

కార్తీక మాసంలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆయనకు అభిషేకాలు చేస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఒక్కో అభిషేకంతో ఒక్కో ఫలితముంటుందని పండితులు చెబుతున్నారు. అపమృత్యు భయం పోవడానికి నువ్వుల నూనె అభిషేకం ఉత్తమం అంటున్నారు. ఫలితంగా అకాల మరణ భయం దరిచేరదని పేర్కొంటున్నారు. ‘నువ్వుల నూనె శని దేవునికి ప్రీతిపాత్రమైనది. శివుడిని ఈ నూనెతో అభిషేకిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి’ అని సూచిస్తున్నారు.