News April 24, 2024
డుప్లెసిస్, కరన్కు భారీ జరిమానా

నిన్న జరిగిన 2 మ్యాచుల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్ల కెప్టెన్లకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానాలను విధించింది. గుజరాత్తో మ్యాచ్లో అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కరన్కు మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పడింది. ఇక KKRతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ డు ప్లెసిస్కు రూ.12 లక్షల జరిమానా పడింది. మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేస్తే రెట్టింపు ఫైన్ విధిస్తామని కమిటీ స్పష్టం చేసింది.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


