News November 7, 2024
వాయు కాలుష్యం కట్టడికి భారీ జరిమానాలు

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించేలా ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్-2023’ చట్టంలో సవరణలు చేసింది. 2 ఎకరాలలోపు రూ.5,000, 2-5 ఎకరాల మధ్య రూ.10,000, 5 ఎకరాల పైన రూ.30,000 ఫైన్ వేయనుంది.
Similar News
News January 28, 2026
ఈయూతో డీల్.. భారత్ సాధించిన గొప్ప విజయం: US ట్రేడ్ ప్రతినిధి

ఇండియా-EU మధ్య కుదిరిన <<18973407>>ఒప్పందం<<>>పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసలు కురిపించారు. ‘డీల్లోని కొన్ని అంశాలు చదివాను. ఇండియాకు అనుకూలంగా కనిపిస్తోంది. యురోపియన్ మార్కెట్లో విస్తృత అవకాశాలు దక్కుతాయి. డీల్ అమల్లోకి వచ్చాక ఆ దేశానికి గొప్ప విజయంగా నిలవబోతోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత వర్కర్లు యూరప్కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు.
News January 28, 2026
వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.
News January 28, 2026
2023లోనూ ఆ విమానానికి ప్రమాదం!

అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి సంచలన విషయం బయటికొచ్చింది. ఇదే విమానం 2023 సెప్టెంబర్లోనూ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. VSR వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.


