News November 7, 2024
వాయు కాలుష్యం కట్టడికి భారీ జరిమానాలు

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించేలా ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్-2023’ చట్టంలో సవరణలు చేసింది. 2 ఎకరాలలోపు రూ.5,000, 2-5 ఎకరాల మధ్య రూ.10,000, 5 ఎకరాల పైన రూ.30,000 ఫైన్ వేయనుంది.
Similar News
News December 3, 2025
T20 వరల్డ్ కప్కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్పూర్లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
News December 3, 2025
టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్నెట్ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.
టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్దీప్
News December 3, 2025
కాలి వేళ్ల వెంట్రుకలు రాలిపోతున్నాయా?

కాలి వేళ్లపై ఉండే వెంట్రుకలు శరీర రక్త ప్రసరణ, జీవక్రియ ఆరోగ్యాన్ని పరోక్షంగా సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘వేగంగా వెంట్రుకలు పెరిగితే రక్తప్రసరణ బాగుందని అర్థం. రక్త ప్రసరణ తగ్గినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. దీర్ఘకాలిక మధుమేహం లేదా PAD వంటి సమస్యల తొలిదశలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వ్యాధి నిర్ధారణకు ముందు శారీరక సూచనగా పరిగణించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.


