News May 24, 2024

మేడిగడ్డ వద్ద మళ్లీ భారీ శబ్దాలు!

image

TG: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులు నిలిపేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది.

Similar News

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.

News November 18, 2025

నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <>https://cbseitms.rcil.gov.in/nvs/<<>>లో రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఎంపికైన వారికి దేశంలోని 653 నవోదయల్లో ప్రవేశం కల్పిస్తారు.