News October 14, 2024
భారీ వర్షాలు.. CM చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: భారీ వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలని CM చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చెరువులు, కాల్వలు, నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని సూచించారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చెప్పారు. కాగా NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచామని సీఎంకు అధికారులు తెలిపారు.
Similar News
News December 3, 2025
ఓడరేవుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు: MP మేడా

ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని MP మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్లో కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవుల అభివృద్ధి గురించి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ప్రశ్నలు అడిగారు. పోర్టు ఆర్ధిక కార్యకలాపాలలో ఎస్సీ, ఎస్టీ కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన తీరును అడిగారు. లింగ సమానత్వ ఉపాధి, సమాన అవకాశాల కల్పన కోసం తీసుకున్న చర్యలు వివరించాలన్నారు.
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.


