News August 31, 2024
భారీ వర్షాలు.. పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

AP: భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2,3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్నిబట్టి ఇవాళ పింఛన్ అందనివారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు.
Similar News
News December 14, 2025
నెలకు రూ.20వేలు.. రేపటి వరకే ఛాన్స్

RBI సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్-2026 (3 నెలలు) దరఖాస్తుల గడువు రేపటితో (DEC 15) ముగియనుంది. PG, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, LLB, ఎకనామిక్స్, ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి RBI ఆఫీసుల్లో పని చేసే అవకాశం, నెలకు రూ.20వేలు స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్సైట్: <
News December 14, 2025
అత్యధిక స్థానాలు మావే: పీసీసీ చీఫ్

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమష్టిగా కష్టపడ్డారని చెప్పారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా సర్కారు ముందుకు సాగుతోందని వివరించారు.
News December 14, 2025
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

భారత బౌలర్ల విజృంభణతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 117 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో మార్క్రమ్ (61) మినహా ఇంకెవరూ ప్రభావం చూపలేదు. ఫెరీరా 20, ఆన్రిచ్ నోర్జే 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్, అర్ష్దీప్, కుల్దీప్ తలో 2 వికెట్లు, హార్దిక్, దూబే చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 118.


