News August 31, 2024

భారీ వర్షాలు.. పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

image

AP: భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2,3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్నిబట్టి ఇవాళ పింఛన్ అందనివారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు.

Similar News

News December 14, 2025

ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. కామారెడ్డి (D) గాంధారి (M) పొతంగల్‌ఖుర్ద్‌లో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్‌లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సంతోష్‌కు 278 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం (D) అశ్వారావుపేట (M) పాత రెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఉమ్మలా వెంకటరమణ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 14, 2025

భారత్ బౌలింగ్.. బుమ్రా స్థానంలో హర్షిత్

image

సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగే మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

News December 14, 2025

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

image

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.