News August 17, 2025
భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమగోదావరి, కాకినాడకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలోనూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News August 18, 2025
కోహ్లీ దెబ్బకు రికార్డులన్నీ ‘సలామ్’ అనాల్సిందే!

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 17 ఏళ్లు. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన ODIలో విరాట్ డెబ్యూ చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా ఎదిగారు. కెప్టెన్గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. దిగ్గజ ప్లేయర్లు నెలకొల్పిన ఎన్నో రికార్డులు కింగ్ ధాటికి సలామ్ అన్నాయి. T20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు.
News August 18, 2025
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. ఐదుగురు దుర్మరణం

TG: హైదరాబాద్లో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాంతపూర్లోని గోకుల్ నగర్లో శ్రీ కృష్ణ శోభా యాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు.
News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>