News September 22, 2024

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, తూ.గో, YSR, అన్నమయ్య, చిత్తూరులో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News September 22, 2024

దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

image

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్‌లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.

News September 22, 2024

శ్రీవాణి లెక్కలు కూడా తేల్చాలి: పవన్ కళ్యాణ్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ <<14169086>>విచారణను<<>> డిప్యూటీ CM పవన్ స్వాగతించారు. ‘CM చంద్రబాబు నిర్ణయంతో తిరుమలలో ఎవరి వల్ల ఈ అపవిత్రత జరిగిందనే విషయం బయటకు వస్తుంది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్ల వ్యవహారంపైనా విచారించాలి. భగవంతుడికి చేసే సేవల విషయంలోనే కాదు. ఆర్థికపరమైన అంశాలలోనూ గత పాలకులు ఏ విధమైన పెడపోకడలు అవలంభించారో ప్రజలకు తెలియాల్సిన సమయం ఇది. ధర్మో రక్షతి రక్షిత:’ అని Xలో ట్వీట్ చేశారు.

News September 22, 2024

ఇక నుంచి రోజుకి ₹100, నెలకు ₹250 కూడా పెట్టుబ‌డి పెట్టొచ్చు

image

చిన్న‌మొత్తంలో పెట్టుబ‌డి పెట్టేవారిని ప్రోత్స‌హించేలా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మైక్రో-SIPల‌ను తీసుకురావ‌డానికి సెబీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి రోజుకు రూ.300 కాకుండా రూ.100 కూడా పెట్టుబ‌డిగా పెట్టొచ్చు. అలాగే నెల‌కు రూ.వెయ్యికి బదులుగా రూ.250, మూణ్నెళ్లకు రూ.3 వేల‌కు బ‌దులుగా రూ.750 వ‌ర‌కు పెట్టుబడి పెట్ట‌వ‌చ్చు. అక్టోబర్ మొదటివారంలో LIC MF అలాంటి ప్లాన్ ప్రారంభించనుంది.