News October 24, 2024
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100kms వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News January 27, 2026
ఈ ఎర పంటలతో ఈ ప్రధాన పంటల్లో పురుగుల నియంత్రణ

☛ బత్తాయి పంట చుట్టూ టమాటాను సాగు చేసి పండు రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ☛ పసుపు చుట్టూ ఆముదం పంట నాటి కొమ్మ, కాయ తొలుచు పురుగులను ☛ తీగజాతి కూరగాయల పంటల చుట్టూ మొక్కజొన్నను సాగు చేసి పండు ఈగల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ టమాటా చుట్టూ బంతి/దోసను సాగు చేసి కాయతొలుచు పురుగులు/తెల్లదోమలను.. బంగాళాదుంప పంట చుట్టూ వంకాయ మొక్కలను నాటి అక్షింతల పురుగులను కట్టడి చేయవచ్చు.
News January 27, 2026
రామకృష్ణ తీర్థానికి ఎలా వెళ్లాలంటే..?

రామకృష్ణ తీర్థం కేవలం మాఘ పౌర్ణమి నాడు మాత్రమే భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. భక్తులు తిరుమల బస్టాండ్ నుంచి బస్సులో పాపవినాశనం చేరుకోవాలి. అక్కడి నుంచి దట్టమైన అడవిలో కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులను 5 AM నుంచి 12 PM వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత వెళ్తే పంపించరు. భక్తులకు మార్గమధ్యలో ఆహారం, నీటిని TTD ఉచితంగా అందిస్తుంది. సాయంత్రం లోపు తిరిగి రావడం తప్పనిసరి.
News January 27, 2026
ఎవరు సాక్షి.. ఎవరు దోషి?

TG: BRS హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈక్రమంలోనే నాటి కీలక నేతలు హరీశ్ రావు, KTRను విచారించిన సిట్ ఇవాళ సంతోష్ రావును ప్రశ్నించనుంది. 2,3 రోజుల్లో కవితను కూడా విచారిస్తుందని సమాచారం. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఇప్పటికే ఆమె ఆరోపించారు. అయితే ఇప్పటివరకు పిలిచిన నేతలు సాక్షులా? నిందితులా? అసలు ఈ కేసులో దోషులెవరు? అన్నది ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలు.


