News October 4, 2025
పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. బయటికి రావద్దని హెచ్చరికలు

AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. బయట ఉన్నవారు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.
Similar News
News October 4, 2025
పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News October 4, 2025
స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
News October 4, 2025
వెస్టిండీస్.. ఇదేం ఆట!

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?