News August 6, 2025
ఆటో డ్రైవర్లకు సహాయం: CBN

AP: ‘స్త్రీశక్తి’ పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే వారు నష్టపోతారన్న అభిప్రాయాలపై స్పందించారు. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, తగిన సహాయం చేయాలన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు అందరూ పాల్గొనాలని CM సూచించారు. కాగా AUG 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు కానుంది.
Similar News
News August 6, 2025
ట్రంప్ను లెక్కచేయని భారత్.. రష్యాతో కీలక ఒప్పందం

ట్రేడ్ రిలేషన్స్, సహకారం మరింత పెంచుకునేందుకు భారత్, రష్యా ప్రొటోకాల్ డీల్పై సంతకాలు చేశాయి. ఢిల్లీలో జరిగిన మాడర్నైజేషన్&కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్ సెషన్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అల్యూమినియం, ఫెర్టిలైజర్స్, రైల్వేస్, మైనింగ్ టెక్నాలజీ తదితర సెక్టార్స్పై చర్చించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. రష్యాతో సంబంధాలపై ట్రంప్ హెచ్చరిస్తున్నా భారత్ లెక్కచేయకపోవడం గమనార్హం.
News August 6, 2025
ఇది అన్యాయం, అసమంజసం: భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు.
News August 6, 2025
ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

ఇండియాపై టారిఫ్స్ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్తో సీజ్ఫైర్ వరకు ట్రంప్కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.