News September 21, 2024
ఈ నెల 25న వరద బాధితులకు సాయం: CM

AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10వేలు నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని CM సూచించారు.
Similar News
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


