News March 30, 2024
అందుకే అతడితో కెమిస్ట్రీ కుదిరింది: శ్రుతి హాసన్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన స్నేహితుడని.. అందుకే ‘ఇనిమేల్’ పాటలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. ‘లోకేశ్ గొప్ప దర్శకుడే కాకుండా నటుడు కూడా. ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు ఎగిరి గంతేశా. కెమెరా ముందు ఆయన బాగా నటించారు. తొలుత ఈ పాటను ఇంగ్లిష్లో రాశాం. ఆ తర్వాత నాన్న (కమల్ హాసన్) సాయంతో తమిళంలో చేశాం’ అని ఆమె చెప్పారు.
Similar News
News October 5, 2024
ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 5, 2024
బంగ్లాతో టీ20 సిరీస్కు తిలక్ వర్మ
టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.
News October 5, 2024
సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. CBN ఆగ్రహం
AP: ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.