News July 10, 2024
ఇకపై నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తా: సీఎం రేవంత్

TG: ప్రభుత్వోపాధ్యాయులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ‘ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలుంటాయి. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలిస్తున్నాం. వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలి. తప్పుంటే ఉన్నతాధికారులపైనైనా చర్యలు తప్పవు. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News March 31, 2026
పంచాయతీలకు గుడ్న్యూస్.. ₹247Cr విడుదల

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.
News March 31, 2026
పంచాయతీలకు గుడ్న్యూస్.. ₹247Cr విడుదల

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.
News March 31, 2026
రీల్స్ చేస్తూ బాలిక మృతి

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.


