News April 14, 2025
టూవీలర్లలో హీరో.. కార్లలో మారుతి

టూవీలర్ల అమ్మకాల్లో హీరో మోటార్స్ ఇండియాలో టాప్లో దూసుకెళ్తోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం 2024-25లో ఆ కంపెనీ 54లక్షల బైకులను విక్రయించింది. 48లక్షల వాహనాల విక్రయాలతో హోండా రెండో స్థానంలో ఉంది. అలాగే, కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో సుమారు 16.72లక్షల కార్లను అమ్మింది. ఇదే కంపెనీ గతేడాది 16.08లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ 2వ ప్లేస్ దక్కించుకుంది.
Similar News
News April 15, 2025
సన్నగా మారిన ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

ఇటీవల జూ.ఎన్టీఆర్ సన్నగా మారడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి బాలేదని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అని, ఆయన ఏం చేసినా.. ఎలా ఉన్నా సినిమా కోసమేనని పేర్కొన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాక ‘దేవర-2’ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ‘దేవర’కు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
News April 15, 2025
వైట్ హౌస్ సెక్రటరీపై చైనా రాయబారి సెటైర్

ప్రతీకార సుంకాలతో చైనా, US మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల ప్రతినిధులు పరస్పరం మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలోని చైనా రాయబారి జాంగ్ జిషెంగ్ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ను టార్గెట్ చేశారు. తమ దేశంలో తయారైన డ్రెస్ను ఆమె ధరించారని ట్వీట్ చేశారు. ‘బిజినెస్ కోసం చైనాను నిందిస్తారు. అవసరానికి చైనా వస్తువులనే కొంటారు’ అని సెటైర్ వేశారు.
News April 15, 2025
మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా.. ఎర్రబెల్లి సవాల్

TG: కాంగ్రెస్కు BRS మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు. ‘CM రేవంత్కి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. 119 అసెంబ్లీ స్థానాల్లో పదింట మాత్రమే కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉంది. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడుతుంది. అందుకే ఆయన భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.