News March 22, 2025
ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.
Similar News
News February 17, 2026
26న నెల్లూరుకు జగన్..!

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.
News February 17, 2026
మొదలవని మ్యాచ్.. ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనా?

T20 WC2026: ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 భవిష్యత్తును నిర్ణయించే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలె స్టేడియంలో వర్షం పడుతుండటంతో జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గే అవకాశాలు లేవని క్రిక్బజ్ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి జింబాబ్వే గెలిచినా కంగారూలు ఇంటిదారి పట్టినట్లే.
News February 17, 2026
అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగులగొడతారు?

హిందూ ధర్మంలో మట్టి కుండను మానవ శరీరానికి, దానిలోని నీటిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో చిల్లుల నుంచి కారే నీరు, శరీరం-ఆత్మ మధ్య బంధం క్రమంగా వీడిపోవడాన్ని సూచిస్తుంది. చివరగా కుండను పగలగొట్టడం అంటే.. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకుని, పంచభూతాలతో నిర్మితమైన శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోయిందని, ఆత్మ మోక్ష మార్గంలో స్వేచ్ఛగా పయనించాలని అర్థం. ఇది ఆత్మ అంతిమ విముక్తికి ప్రతీక.


