News October 20, 2024
హీరో కిచ్చా సుదీప్కు మాతృవియోగం

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తన తల్లి అంటే తనకెంతో ఇష్టమని బిగ్బాస్, ఇతర ఇంటర్వ్యూలు & వేదికలపై ఆయన చెప్తుండేవారు. ‘ఈగ’, విక్రాంత్ రోణ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Similar News
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 6, 2025
భక్తికి ప్రతీక ‘తిరుమలనంబి ఆలయం’

తిరుమలనంబి శ్రీవారికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తిరుమలకు వచ్చిన మొదటి భక్తుడు. ఆయన భగవద్రామానుజులకు అలిపిరిలో రామాయణ రహస్యాలను బోధించారు. అందుకే, శ్రీవారి ఊరేగింపు సమయంలో, దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయం వద్ద స్వామివారు ఆగి, హారతిని స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయం ఆయన గొప్ప భక్తికి, శ్రీవారిపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


