News February 7, 2025
ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.
Similar News
News October 13, 2025
ఉల్లి ఆధారిత ఉత్పత్తులు ఇవే..

* ఆనియర్ ఫ్లేక్స్: ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయించడం/ఎండబెట్టడం ద్వారా ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్లేక్స్ తయారుచేస్తారు. వీటిని సూప్లు, కూరల్లో ఉపయోగిస్తారు.
* ఉల్లి పొడి/పేస్ట్: ఎండిన ఉల్లిపాయలను పౌడర్గా చేసి, వంటలు, సూప్లు, సాస్లలో వాడొచ్చు. పేస్టునూ ఉపయోగించవచ్చు.
ఉల్లి నూనె: జుట్టు సమస్యల నివారణకు ఉల్లినూనెకు డిమాండ్ ఉంది.
* ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులకు లాభాలు చేకూర్చవచ్చు.
News October 13, 2025
‘ఉల్లి’తో రైతుకు మేలు జరగాలంటే?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కానీ ఆ ఉల్లిని పండించే రైతుకు కన్నీళ్లు తప్పట్లేదు. కిలో ₹5-10 మాత్రమే పలుకుతుండటంతో అన్నదాతలు వాపోతున్నారు. రేటు పడిపోయినా ఇబ్బంది లేకుండా ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆనియన్ ఫ్లేక్స్, పొడి, పేస్ట్, నూనె, ఊరగాయలు, చట్నీలు తయారుచేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
* ప్రతిరోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 13, 2025
హగ్కు రూ.3.73 లక్షల ఫీజు.. యువతిపై ట్రోల్స్

చైనాలో ఓ యువతి చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. చైనీస్ పద్ధతి ప్రకారం యువతికి యువకుడి ఫ్యామిలీ గిఫ్ట్గా ₹25 లక్షలిచ్చింది. ఇంతలో ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసి మనీ తిరిగివ్వడానికి ఒప్పుకుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో తనను హగ్ చేసుకున్నందుకు ₹3.73 లక్షల ఫీజు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. SMలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.