News December 9, 2024
ప్రభాస్ కోసం కథ రాసిన హీరో రిషబ్ శెట్టి?

‘కాంతార’ సినిమాతో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను రాసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రాల్లో ఒక దానికి కథను అందించారని, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపాయి. కాగా, సదరు నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభాస్తో మొత్తం మూడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News September 16, 2025
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన

TG: బీసీ నినాదంతో MLC తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గం.11AMకు ఈ కార్యక్రమం జరగనుంది. ‘బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి’ అని మల్లన్న ఆకాంక్షించారు.
News September 16, 2025
ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ ఐకాన్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ మృతి

హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు & డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు రాబర్ట్ సన్నిహితుడు సిండి బెర్గర్ వెల్లడించారు. 1960 నుంచి ఇంగ్లిష్ సినిమాలకు ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడిగా సేవలందించారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.
News September 16, 2025
BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.