News September 11, 2024

లోకేశ్‌కు చెక్‌ అందించిన హీరో సాయి ధరమ్ తేజ్

image

ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ను అందించారు. ‘ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన చెక్‌ను లోకేశ్ అన్నకు అందించా’ అని ట్వీట్ చేశారు. కాగా, తేజ్‌ను అభినందిస్తూ లోకేశ్ రిప్లై ఇచ్చారు.

Similar News

News August 24, 2025

GATE-2026 షెడ్యూల్‌లో మార్పు

image

M.Tech, PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2026) షెడ్యూల్‌ మారింది. రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈనెల 28నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారిక <>సైట్‌లో<<>> పేర్కొంది. SEP 28న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలస్య రుసుంతో OCT 9 వరకు అప్లై చేసుకోవచ్చు. 2026 FEB 7,8,14,15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

News August 24, 2025

103 శాటిలైట్స్, చంద్రయాన్-8.. ఇస్రో ప్లాన్ ఇదే!

image

ఇస్రో ఫ్యూచర్ ప్లాన్‌పై స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘2025-2040 వరకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ 15 ఏళ్లలో సెక్యూరిటీ, సర్వైలెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, ల్యాండ్, ఓషన్ అప్లికేషన్స్ తదితర 103 శాటిలైట్స్ లాంచ్ చేయనున్నాం. చంద్రయాన్-4,5,6,7,8 మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ స్పేస్ ఫెయిరింగ్ నేషన్‌గా భారత్ ఎదుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News August 24, 2025

రాత్రి కొబ్బరినూనె తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

image

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్‌, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.