News September 29, 2024

వీరోచితం: చనిపోయే ముందు ఉగ్రవాదిని అంతం చేశాడు!

image

తాను చనిపోయే స్థితిలో ఉన్నా కనీసం ఒక్క ఉగ్రవాదినైనా వెంట తీసుకుపోవాలనుకున్నారాయన. తూటా దెబ్బకి ఒళ్లంతా రక్తమోడుతున్నా ఓ ముష్కరుడిని హతమార్చాకే కన్నుమూశారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్‌దీ వీరగాథ. మండ్లీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవీరుడైన బషీర్‌కు రాష్ట్ర పోలీసు శాఖ ఘన నివాళులర్పించింది.

Similar News

News January 16, 2026

2026లో 1,25,000 కొత్త ఉద్యోగాలు!

image

టెక్ రంగంలో 2026లో ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని Adecco India అంచనా వేసింది. క్రితం ఏడాదితో పోలిస్తే రిక్రూట్‌మెంట్ 12-15% పెరగొచ్చని తెలిపింది. వివిధ విభాగాల్లో 1,25,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. IT, IT సర్వీసెస్‌ సెక్టార్లలో స్టెబిలిటీ వచ్చిందని తెలిపింది. AI, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ, డేటా ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగినట్లు వెల్లడించింది.

News January 16, 2026

మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.

News January 16, 2026

ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

image

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.