News February 15, 2025
రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739615456781_81-normal-WIFI.webp)
గోవా బ్యూటీ ఇలియానా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. తాజాగా విడుదల చేసిన ఇన్స్టా రీల్లో ప్రెగ్నెన్సీ కిట్ను చూపించడంతో పాటు మిడ్నైట్ స్నాక్స్ ఫొటోలను పంచుకుంది. ‘నువ్వు గర్భవతివని నాకు చెప్పకుండా గర్భవతివని చెప్పు’ అని రాసుకొచ్చింది. కాగా మైఖేల్ డోలన్ను పెళ్లాడిన ఇలియానాకు 2023 ఆగష్టులో కోవా ఫోనిక్స్ డోలన్ అనే బాబు పుట్టాడు.
Similar News
News February 16, 2025
మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739646716602_1045-normal-WIFI.webp)
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.
News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739650132759_1045-normal-WIFI.webp)
ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.
News February 16, 2025
తండ్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్: బ్రహ్మానందం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739645278421_1045-normal-WIFI.webp)
తండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలని నటుడు బ్రహ్మానందం ‘బ్రహ్మా ఆనందం’ ప్రెస్మీట్లో విజ్ఞప్తి చేశారు. ‘20-25 ఏళ్లు దాటాక పిల్లల్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలన్న ఆలోచన రాకూడదు. రెక్కలు వచ్చిన పక్షులు అవే ఎగురుతాయి. ఎగరటాన్ని అలవాటు చేయాలి తప్ప ఇంత వరకే రెక్క ఉండాలంటూ నిబంధనలు పెట్టడం వల్ల మరింత గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. మా పిల్లల్ని నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు’ అని వెల్లడించారు.