News October 21, 2024
తల్లి మృతిపై హీరో ఎమోషనల్ పోస్ట్

తానెంతో ప్రేమించే తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంపై హీరో <<14405382>>కిచ్చా సుదీప్ <<>>ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఆమె మనిషి రూపంలో ఉన్న దేవత. నా గురువు. ఇప్పుడు ఆమె జ్ఞాపకమే. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించలేకపోతున్నా. ప్రతిరోజు ఉదయం 5.30కి గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చేది. నేను ఆమెతో చివరిసారి మాట్లాడలేకపోయా. నా జీవితంలో అత్యంత విలువైనది కోల్పోయా. రెస్ట్ తీసుకో అమ్మా’ అని పోస్ట్ చేశారు.
Similar News
News November 4, 2025
మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.
News November 4, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 4, 2025
కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.


