News June 12, 2024
ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా

లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది. తన దళానికి చెందిన టాప్ కమాండర్ హజ్ అబూ తలేబ్ను ఇజ్రాయెల్ చంపడంతో ప్రతీకార దాడికి దిగింది. నార్త్ ఇజ్రాయెల్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. కాగా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్లకు హెజ్బొల్లా మద్దతు ప్రకటించింది. ఈ గ్రూప్కు ఇరాన్ సాయమందిస్తోంది.
Similar News
News September 14, 2025
కొడుకును చంపి నదిలో పడేశాడు!

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News September 14, 2025
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.
News September 14, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జాబ్లు

<