News July 4, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడులు

image

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇవాళ 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. హెజ్బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడింది. రామ్యెహ్, హూలాలోని మిలిటరీ నిర్మాణాలపై దాడులు జరపగా ఒకరు మృతి చెందారు. కాగా హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది. ఈ సంస్థకు ఇరాన్ సాయం చేస్తోంది.

Similar News

News March 20, 2026

ఇరాన్ యుద్ధం.. కేంద్రాన్ని సమర్థించిన థరూర్

image

ఇరాన్ విషయంలో కేంద్రం ‘సైలెన్స్’ను కాంగ్రెస్ MP శశి థరూర్ సమర్థించారు. ఈ విషయంలో ఆయన మరోసారి పార్టీ లైన్‌ను దాటారు. కొన్నాళ్లుగా కేంద్రం వైఖరిని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. స్వయంగా అగ్రనేత <<19286514>>సోనియా గాంధీ<<>> ఈ విషయంపై వ్యాసం రాశారు. థరూర్ మాత్రం వాటన్నింటితో విభేదిస్తూ.. కేంద్రం ‘సరెండర్’ కాలేదని ‘సంయమనం’ పాటిస్తోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే సరైన విధానమని పేర్కొన్నారు.

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.