News September 7, 2024
హై అలర్ట్.. వరదలపై ప్రభుత్వం WARNING

విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉందని, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడం వల్ల కొత్తగా అక్కడికి వరద నీరు చేరడం లేదని, అయినా వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఖమ్మం పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.
Similar News
News February 5, 2026
శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కిషన్ రెడ్డి

HYD హైస్పీడ్ రైల్ హబ్గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘TGలో రైల్వే మౌలిక సదుపాయాలకు బడ్జెట్లో ₹5,454Cr కేటాయించాం. శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా HYD-BLR, CHE-PUNE జర్నీకి 3hrs కంటే తక్కువ సమయం పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ₹47,984Cr విలువైన ప్రాజెక్టులు కొనసాగుతుండగా, 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని పేర్కొన్నారు.
News February 5, 2026
ఏపీలోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

AP: కాకినాడలోని <
News February 5, 2026
తులసి మొక్కను నాటుతున్నారా?

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


