News February 24, 2025
పాకిస్థాన్లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Similar News
News November 28, 2025
గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

RS బ్రదర్స్ 16వ షోరూమ్ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.
News November 28, 2025
వరిలో జింక్ లోపం, కాండం తొలిచే పురుగు నివారణ

☛ వరి పంట మొక్క ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ లోపంగా భావించాలి. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
☛ వరిలో కాండం తొలిచే పురుగు/మొగి పురుగు నివారణకు 20-25 కిలోల ఇసుకలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోల చొప్పున కలిపి బురద పదునులో వేయాలి.
News November 28, 2025
కేసీఆర్ వల్ల కాదు సోనియా వల్ల తెలంగాణ వచ్చింది: పీసీసీ చీఫ్

TG: 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకమని, ఆయన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి BRS సిద్ధమైందని మీడియా సమావేశంలో విమర్శించారు.


