News May 20, 2024

సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ

image

మనిషి జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌తో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.

Similar News

News November 24, 2025

‘పోలార్ నైట్’ అంటే ఇదే!

image

ఉత్కియాగ్విక్‌లో(USA) ‘<<18374492>>పోలార్ నైట్<<>>’ ప్రవేశించిన విషయం తెలిసిందే. పోలార్ నైట్ అనేది ధ్రువ ప్రాంతాలలో (ఆర్కిటిక్, అంటార్కిటిక్) సంభవించే ఒక సహజ దృగ్విషయం. దీనివల్ల కొన్ని నెలల పాటు సూర్యుడు 24 గంటలు క్షితిజానికి(Horizon) దిగువనే ఉండిపోతాడు. దీని కారణంగా ఆ ప్రాంతాలు సంధ్యా సమయం లాంటి వెలుగులోనే ఉంటాయి. భూమి తన అక్షంపై వంగి తిరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 24, 2025

నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

image

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.

News November 24, 2025

నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

image

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.